ఒక పక్క భారత బలగాలు ప్రతీ రోజు వరుస ఆపరేషన్ లు నిర్వహిస్తున్నా సరే... ఉగ్రవాదులు మాత్రం ఎక్కడో ఒక చోట కాల్పులకు తేగబడుతునే ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ లోని అనంత నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు స్థానిక పోలీసులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నారు. ఇక తాజాగా అనంతనాగ్ (జమ్మూ & కాశ్మీర్) లోని బిజ్బెహారాలో హైవే సెక్యూరిటీలో మోహరించిన సిఆర్పిఎఫ్ పార్టీపై ఉగ్రవాదులు దాడి చేసారు.
ఈ దాడిలో ఒక జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఆపరేషన్ కొనసాగుతుందని... ఈ ప్రాంతంలో మరి కొందరు ఉగ్రవాదులు ఉన్నారు అని తాము గాలింపు చర్యలు చేపట్టామని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) మీడియాకు వెల్లడించారు. కాగా మరో ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపాయి బలగాలు.