భారత్ చైనా సరిహద్దుల్లో అమెరికా బలగాలు మొహరిస్తే మాత్రం... యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అమెరికా చైనా విషయంలో ముందు నుంచి కూడా కక్ష సాధింపుగా ఉంది. అమెరికాలో కరోనా రావడానికి గానూ చైనానే పూర్తిగా కారణం అని ప్రపంచ ఆరోగ్య సంస్థను అడ్డం పెట్టుకుని చైనా డ్రామాలు ఆడుతుంది అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపిస్తున్నారు.
ఇక ఇప్పుడు సరిహద్దుల్లో బలగాలను మొహరిస్తామని, జర్మని లో ఉన్న తమ బలగాలను తీసుకొచ్చి అక్కడ భారత్ కి అండగా ఉంటామని చెప్తుంది. అదే జరిగితే మాత్రం చైనాకు రష్యా లేదా టిబెట్ అండగా ఉండే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత రష్యా కూడా అండగా నిలిచే అవకాశాలు ఉంటాయి, ఉత్తర కొరియా బలగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్ని చైనాపై విమర్శలు చేస్తోన్న వేళ, సరిహద్దులో యుద్ద మేఘాలు కమ్ము కోవడంతో భారత్ - చైనా మధ్య ఏం జరుగుతుందా ? అని ప్రపంచం ఎంతో ఆసక్తితో ఉంది.