కరీంనగర్ జిల్లా చొప్పదండి లో కాంగ్రెస్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. కాల్వ నిర్మాణంలో జాప్యం జరుగుతుందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని చెవిలో పువ్వులు పెట్టుకుని వరద కాల్వ దగ్గర ఆందోళన చేపట్టారు. 

 


 చొప్పదండి ఎమ్మెల్యే కు కమిషన్  మీద ఉన్న శ్రద్ధ రైతాంగ సమస్యలపై లేదు అంటూ విమర్శించారు. ఏడాదిలోగా కాలువ నిర్మాణం పూర్తి చేసి రైతులందరికీ నీళ్లు అందిస్తామని చెప్పిన ఎమ్మెల్యే మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: