ఆంధ్రప్రదేశ్ లో నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంపై అధికార వైసీపీ ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ మనిషి అని గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్న అధికార పార్టీ నేతలు ఇప్పుడు ఆధారాలతో సహా పట్టించారు. ఇక ఆయన ఆ పదవిలో ఉండటానికి ఏ మాత్రం అర్హుడు కాదు అని మండిపడుతున్నారు. 

 

తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి వైసీపీ నేతలు సిద్దమయ్యారు. నిమ్మగడ్డ రమేష్ వైసీపీకి వ్యతిరేకంగా కుట్రలు పన్నడమే కాదు రాజకీయ నాయకులతో సావాసం చేస్తున్నారు అని ఆధారాలతో సహా చూపించాలి అని భావిస్తున్నారు. ఇక ఆయనను ఏ మాత్రం క్షమించే ప్రసక్తే లేదు అని తమ ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగా కుట్రలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: