నిజామాబాద్ పార్లమెంట్ కి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మళ్ళీ ఉద్యమ బాట పట్టారు. కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఆమె పోరాటం మొదలు పెట్టారు. దేశంలోని కొన్ని బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నేపధ్యంలోనే కేంద్రం దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు.
రెడ్హిల్స్లోని సింగరేణి భవన్ ఎదుట తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం నేతలు నిరసన వ్యక్తం చేయడమే కాకుండా దిష్టి బొమ్మలను ధ్వంశం చేసారు. టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) జూలై 2న 24 గంటల సమ్మెకు దిగాలని నిర్ణయం తీసుకుంది.