దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి గాని తగ్గడం లేదు. దేశంలోని మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల తీవ్రత చాలా అధికంగా ఉంది. లాక్ డౌన్ లో సడలింపు లు ఎప్పుడు అయితే ఇచ్చారో ఇక అక్కడి నుంచి కూడా వరుసగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. అసలు కరోనా పెరగడానికి అదే ప్రధాన కారణం అనే ఆరోపణలు వినపడుతున్నాయి. 

 

ఇక ఈ తరుణంలో మరిన్ని సడలింపు లు ఏ మాత్రం కూడా మంచిది కాదు అని కేంద్రం భావిస్తుంది. అందుకే ముఖ్యంగా అంతర్జాతీయ విమానాలను జులై 15 వరకు రద్దు చెయ్యాలి అని నిర్ణయం తీసుకుంది కేంద్రం. కార్గో సర్వీసులను యధావిధిగా ఉంచుతూ అంతర్జాతీయ సర్వీసులపై నిషేధం విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: