ముంబై బాంబు పేలుళ్ళ నిందితుడు యూసఫ్ మెమన్ ముంబై జైలులో  మృతి చెందాడు. అతను ముంబై లోని తానే జైలులో మృతి చెందాడు అని జైలు అధికారులు వెల్లడించారు. అయితే అతను ఎందుకు మరణించాడు అనేది మాత్రం వెల్లడించలేదు. అతని సోదరుడు తో కలిసి ముంబై లో బాంబు పేలుళ్లకు అతను కుట్ర చేసిన సంగతి తెలిసిందే. 

 

2015 లో అతని సోదరుడు యాకూబ్ మెమన్ ని ప్రభుత్వం ఉరి తీసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇతను ఈ విధంగా మరణించాడు. అతని మరణం కి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది. ఇక అతను మరణించాడు అని కుటుంబ సభ్యులకు జైలు అధికారులు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: