ఈ నెల 17 న కరోనా బారిన పడి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిన ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సత్యేందర్ జైన్ ఈ రోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు కరోనా పరిక్షలు నిర్వహించగా నెగటివ్ అని వచ్చింది అని అధికారులు వెల్లడించారు. ఆయనకు తీవ్ర జ్వరంతో పాటుగా న్యుమోనియా కూడా తీవ్రంగా ఉండటంతో ప్లాస్మా చికిత్స అందించారు వైద్యులు. దీనితో ఆయన కరోనా నుంచి పూర్తిగా బయటపడ్డారు. 

 

ఇక ఆయన త్వరగా కోలుకోవాలని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తో పాటుగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా  పోస్ట్ లు కూడా చేసారు. ఇక ఆయన ఢిల్లీ మంత్రి వర్గంలో కాస్త కీలక మంత్రి కావడంతో సిఎం అరవింద్ కేజ్రివాల్ కూడా భయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: