ఆంధ్రప్రదేశ్ పై బిజెపి నేతలు దృష్టి పెట్టారు. కేంద్ర మంత్రులు వరుస పర్యటనలు చేస్తున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ సర్కార్ పై విమర్శలు కూడా చేస్తున్నారు. తాజాగా బిజెపి రాజ్యసభ ఎంపీ సిఎం రమేష్ కూడా కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

ప్రధాని నరేంద్ర  మోదీ ఏపీకి చేస్తున్న సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా క్యాడర్‌ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పార్టీ నేతలకు పలు సూచనలు చేసారు. ఏపీకి మేలు జరగాలంటే కచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావడం ఆవశ్యమని ఆయన పేర్కొన్నారు. కుటుంబ పాలనతో చేసే పార్టీలు కాకుండా ప్రజల క్షేమాన్ని కోరే పార్టీలను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: