తమిళనాడులో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి గాని తగ్గడం లేదు. వేల కేసులు ప్రతీ రోజు కూడా తమిళనాడులో నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే కరోనా మాత్రం ఆగడం లేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా మరోసారి భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

 

తమిళనాడులో 3,523 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రం మొత్తం కేసుల సంఖ్య 74,622 గా ఉంది. వాటిలో 32,305 క్రియాశీల కేసులు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. గత 24 గంటల్లో 46 మంది మరణించారు అని మొత్తం 957 మంది మరణించారు అని రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: