చైనా సైనికులు భారత భూభాగంలోకి రావడంపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తుంది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందో లేదో? ప్రధాని మోదీ స్పష్టంగా ప్రకటన చేయాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేసారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదని ప్రధాని చెప్తున్నారని ఆయన మండిపడ్డారు. 

 

అయితే ఉపగ్రహ చిత్రాలు మాత్రం మరోలా చూపిస్తున్నాయన్నారు. ఇలా ఉంటే చైనా లబ్ధి పొందేందుకు అవకాశం ఇచ్చినట్లవుతుందని ఆయన అన్నారు. చైనా భారత భూభాగాన్ని ఆక్రమించలేదని  మోదీ చెబుతున్నారన్నారు. ఒకవేళ చైనా ఆక్రమిస్తే మాత్రం... ప్రధాని మోదీ మాటలతో చైనాకు లాభం చేకూరినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. దేశానికి భయపడకుండా నిజం చెప్పాలని ఆయన మోడికి సూచించారు. అప్పుడు దేశం మొత్తం అండగా ఉంటుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: