గత కొన్ని రోజలుగా ఏపిలో ఈఎస్ఐ కుంభకోణం కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయు విచారణ చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగాలేదని.. అయినా కక్ష్య పూరితంగా అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రిలో ఏసీబీ అధికారులు ఆయనను విచారించారు.  ఈఎస్ఐ కుంభకోణం కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడి విచారణ రెండో రోజు విచారణ ముగిసింది.

 

తొలి రోజు మూడు గంటల విచారణ జరిపిన అధికారులు... ఈరోజు  ఐదు గంటల సేపు విచారించారు. ఏసీబీ డీఎస్పీలు ప్రసాద్, చిరంజీవి నేతృత్వంతో విచారణ జరిగింది. అచ్చెన్న తరపు లాయర్ హరిబాబు, డాక్టర్ సమక్షంలో విచారించారు. విచారణకు ముందు అచ్చెన్నకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఎండోస్కోపీ చేసిన తర్వాత ప్రత్యేక వార్డుకు తరలించి, అక్కడి విచారించారు. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేశారు. గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రిలో ఏసీబీ అధికారులు ఆయనను విచారించారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: