గల్వాన్​ లోయలో వీరమరణం పొందిన ​కర్నల్ సంతోష్​బాబు, ఇతర జవాన్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ సాయం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు డిప్యూటీ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ ఎంఎస్ పవార్.కర్నల్ సంతోష్​బాబు నివాసానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లి ఆయన కుటుంబానికి సాయం, ఉద్యోగ నియామక పత్రం అందించడంపై డిప్యూటీ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ ఎంఎస్ పవార్ హర్షం వ్యక్తం చేశారు. 

 

 


ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 19 మంది సైనికులకు కూడా సాయం ప్రకటించడంపై ఎంఎస్ ​పవార్ సంతోషం వ్యక్తం చేస్తూ... సీఎంను అభినందించారు.ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషించారని మాజీ ఎంపీ కవితను కూడా పవార్ అభినందించారు. కర్నల్ సంతోష్ బాబు విద్యాభ్యాసం చేసిన కోరుకొండ సైనిక పాఠశాలను సందర్శించాలని కేసీఆర్​ను వైస్ అడ్మిరల్ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: