కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే బిడ్డలను కడతేర్చాడు. గోదావరిలో పిల్లలను తోసేసి ప్రాణాలు తీశాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన యానాంలో జరిగింది. కుటుంబ కలహాలే మరణాలకు కారణమని పోలీసులు తెలిపారు.కుటుంబ కలహాలతో కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో విషాదం చోటు చేసుకుంది.

 

 

 ఎదుర్లంక వారధిపై నుంచి ఓ తండ్రి.. తన ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. యానాంలో ప్రముఖ పత్రిక ఏజెంట్​గా పని చేస్తున్న మొమ్మిడి శ్రీనివాస్... కుమార్తె హరిణి, కుమారుడు హర్షతో మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వచ్చి గోదావరిలో దూకేశాడు.నిన్న ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్​లో శ్రీనివాస్​పై భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.

 


 
 ఈ విషయంలో తీవ్ర మనస్తాపానికి గురైన పిల్లలతో కలిసి శ్రీనివాస్ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక మత్స్యకారులు... గోదావరిలో మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఘటనా స్థలాన్ని డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా పరిశీలించి పోలీసులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: