హైదరాబాద్​ అంబర్​పేటలో విషాదం చోటుచేసుకుంది. మానసిన సమస్యలతో బాధపడుతున్న ఓ యువతి ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమధ్య కాలంలోనే చికిత్స తీసుకుంటున్న యువతి... బలవన్మరణానికి పాల్పడటం కుటుంబసభ్యులను కలచివేసింది.మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్​ అంబర్​పేట్​లో చోటుచేసుకుంది.

 

 

 మహంకాళి ఆలయ వెనుక వీధిలో నివాసముంటున్న కట్టా నందిని(23) గత కొద్ది కాలంగా మానసిక సమస్యలతో బాధపడుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.ఇంటర్మీడియట్​ వరకు చదువుకున్న నందిని ఆ తర్వాత మానసిక సమస్యల వల్ల ఇంటి వద్దే ఉంటోందని తల్లిందండ్రులు తెలిపారు. ఈ మధ్య కాలంలోనే మానసిక చికిత్సాలయంలో నందిని చికిత్స​ తీసుకుంటున్నట్లు వివరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: