ఒక పక్క సినిమాల్లో బిజీ గా ఉంటూనే ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ సోషల్ మీడియాలో తన అభిమానులకు ఫాలోవర్స్ కి ఏదోక సందేశం ఇస్తూ ఉంటారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఏదొకటి పోస్ట్ చేస్తూ ఉంటారు. వీటికి మంచి స్పందన వస్తూ ఉంటుంది. మనిషి ఏ సందర్భంలో ఎలా ఉండాలి అనేది ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 

 

తాజాగా ఆయన ఒక ట్వీట్ చేసారు. “మీకంటే చిన్నవాళ్లను చూసి వీళ్లదేముంది నా కంటే  చాలా చిన్న  వాళ్ళు అనుకోకండి .మీ కళ్ళ ముందే వాళ్ళు చాలా పెద్ద  వాళ్ళు కావచ్చు . అప్పుడు నాలుక కరుచుకుంటే మనకే గాయమౌతుందని తెలిసి మసలుకోండి సన్నిహితులారా అంటూ ఆయన ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: