దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే ఆగడ౦ లేదు. భారత్ లో కరోనా కేసులు 5 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో మరోసారి భారీగా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజే 18 వేల 552 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

 

ఇక యాక్టివ్ కేసులు లక్షా 97 వేలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా మరణాలు 15 వేల  600 పైగా ఉన్నాయి. 384 మంది గత 24 గంటల్లో మరణించారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 2 లక్షల 95 వేల మంది కోలుకున్నారు అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కరోనా కేసుల్లో ఒక్క రోజే ఇదే అత్యధికం.

మరింత సమాచారం తెలుసుకోండి: