దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పరీక్షలను చాలా వేగంగా నిర్వహిస్తున్నారు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూ పోతున్న నేపధ్యంలో ఇప్పుడు కరోనా టెస్ట్ లను కూడా పెంచుతుంది రాష్ట్ర ప్రభుత్వం. కరోనా పరిక్షలపై ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ స్పందించారు.

 

ఢిల్లీ నిన్న ఒకే రోజులో అత్యధిక పరీక్షలు నిర్వహించిందని ఆయన చెప్పారు. మొత్తం నిన్న ఒక్క రోజే 21,144 పరిక్షలు చేసామని అన్నారు. పరిక్షల సంఖ్యను నాలుగు రెట్లు పెంచినట్టు ఆయన వివరించారు. వీటిని ఇంకా పెంచే అవకాశం ఉందని ఆయన వివరించారు. రాబోయే వారం రోజుల్లో కరోనా పరీక్షలను మరింత వేగంగా పెంచుతామని ఆయన పేర్కొన్నారు. కాగా అక్కడ కరోనా కేసులు 70 వేలు దాటిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: