కాపులకు వైసీపీ ప్రభుత్వం అండగా నిలిచింది అని మంత్రి కన్నబాబు అన్నారు. కాపుల కోసం ఉద్యమం చేస్తే చంద్రబాబు నాయుడు అణచివేసారని ఆయన మండిపడ్డారు. ఏడాది కాలంలో కాపులకు 4 వేల 769 కోట్ల రూపాయలు సహాయం చేసామని ఆయన అన్నారు. కాపులకు ఎప్పుడు తమ ప్రభుత్వం అండగా ఉంటుంది అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు. 

 

ఏ ప్రభుత్వం అయినా సరే కార్పోరేషన్ల ద్వారానే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది అని ఆయన అన్నారు. కాపు మహిళల మీద కూడా చంద్రబాబు కేసులు పెట్టారని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. కాపుల కోసం ఎవరు ఏం చేసారో పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే మంచిది అని ఆయన అన్నారు. పవన్ వ్యాఖ్యలు కామెడి గా ఉన్నాయని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: