భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ద వాతావరణం నెలకొన్న నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ లడక్ కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. లడక్ పర్యటనకు మోడీ వెళ్ళడానికి సిద్దమయ్యారు అనే వార్తలు రెండు మూడు రోజుల నుంచి వస్తున్నాయి. లడక్ పర్యటనకు వెళ్లేందుకు గానూ ఆయన ఇప్పటికే రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ తో చర్చించారు. 

 

లడఖ్ లో ఉన్న పరిస్థితులను ఆయన నేరుగా చూసే అవకాశం ఉందని అంటున్నారు. దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు మోడీ అక్కడ పర్యటిస్తే మంచిది అనే ఆలోచనలో ఉన్నారు. దీనితో రక్షణ శాఖ ఇప్పుడు ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతుంది కేంద్రం అని, ఎప్పుడు పర్యటిస్తారు అనేది మాత్రం తెలియదని పరిశీలకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: