మరోసారి ఉత్తరాది రాష్ట్రాలను మిడతలు టార్గెట్ చేసాయి. తాజాగా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా మిడతల దండు సునామీలా వచ్చి పడింది. పాకిస్తాన్ నుంచి రాజస్థాన్ హర్యానా రాష్ట్రాలకు ఈ మిడతలు వచ్చాయి. అక్కడి ప్రజలకు అవి ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నాయి.
మిడతల సమూహాలు గురుగ్రామ్లోని వివిధ ప్రాంతాల్లో ప్రజలను ప్రజలను భయపెట్టాయి. సెక్టార్ -5, పాలమ్ విహార్ ప్రాంతాల్లో అవి ఎక్కువగా ఉన్నాయని అక్కడి అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజస్థాన్ లోని పలు గ్రామల్లో కూడా మిడతల దండు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. దీనితో ఇప్పుడు ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు. అధికారులు కూడా ఇప్పుడు వాటిని తరిమే కార్యక్రమాలు చేపట్టారు.
#WATCH Haryana: Swarms of locusts create menace in different parts of Gurugram; Visuals from Sector-5, Palam vihar pic.twitter.com/1P2Dyk90zR
— ANI (@ANI) June 27, 2020