ఆంధ్రప్రదేశ్ లో ఆగస్ట్ చివరి నుంచి స్కూల్స్ రీ ఓపెన్ చేసే అవకాశం ఉందని... మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలు చేసారు. విద్యాశాఖ కార్యక్రమాలపై మంత్రి డాక్టర్ ఆదిమూలపు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ని తీసుకుని వస్తున్నట్టు తెలిపారు. 

 

విద్యార్ధులకు ఏ సమస్య ఉన్నా సరే దానికి ఫోన్ చేయవచ్చు అని ఆయన స్పష్టం చేసారు. 1800 123 123 124 అనే నెంబర్ ని విడుదల చేసారు. మనబడి నాడు -నేడు, విద్యాకానుకపై అధికారులతో సమీక్ష చేపట్టారు. రాష్ట్ర స్థాయిలో కొనుగోలు చేస్తున్న పరికరాల ప్రదర్శనను ఆయన వీక్షించారు. కార్పోరేట్ స్కూల్స్ కి దీటుగా ప్రభుత్వ స్కూల్స్ ని తయారు చేస్తున్నట్టు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: