హైదరాబాద్ లో ఇప్పుడు సీరియల్ పరిశ్రమను కరోనా భయం వెంటాడుతుంది. కరోనా దెబ్బకు షూటింగ్ లు అన్నీ కూడా ఆపేశారు. ఇక కొన్ని సీరియల్స్ యూనిట్ కి కరోనా వచ్చింది అనే వార్తలు సినీ పరిశ్రమలో కూడా కాస్త కలకలం సృష్టించాయి. ఒక దర్శకుడికి కరోనా వచ్చింది అని అతని నుంచి 33 మందికి కరోనా వచ్చింది అని వార్తలు వచ్చాయి. 

 

దీనితో సదరు దర్శకుడితో కాంటాక్ట్ అయిన 33 మందికి కూడా కరోనా పరిక్షలు నిర్వహించగా వారు అందరికి  కరోనా నెగటివ్ వచ్చింది. దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే షూటింగ్ లు మాత్రం మొదలయ్యే అవకాశాలు కనపడటం లేదు. ఇతర సీరియల్స్ ని కూడా ఆపేశారు. త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: