తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ అంతకంతకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇక రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులతో అటు డాక్టర్లు కూడా భయపడుతున్నారు. పేషెంట్లకు కరోనా చికిత్స అందిస్తూ వారు కూడా వైరస్ బారిన పడుతున్నారు.
అయితే గత పది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైరస్ బారిన పడిన హెడ్ నర్స్ పదవీ విరమణకు ముందు మరణించింది. అయితే కరెక్ట్ గా పదవీ విరమణకు నాలుగు రోజుల ముందు మరణించడం నిజంగా విషాదకరమైన విషయమే .