ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా పతంజలి ఆయుర్వేద సిఈవో ఆచార్య బాలకృష్ణలు చిక్కుల్లో పడ్డారు. వీరితో పాటు మరో ముగ్గురిపై ఎఫైఆర్ నమోదయింది. రాజస్థాన్లోని జైపూర్లో జ్యోతి నగర్ పోలీస్ స్టేషన్ లో బల్బీర్ జకర్ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు వారిపై ఇండియన్ పీనల్ కోడ్ 420, 1954 డ్రంక్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశామని జైపూర్ సౌత్ అడిషనల్ డిసిపి అభినందనలు తెలిపారు. వీరి కారణంగా ఏకంగా ఐదుగురు ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు బల్బీర్ జకర్ .