గత కొంత కాలంగా ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా కేసుల విషయంలో మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ ఏ స్టేజ్ లో ఉన్నాయో తెలిసిందే. ఇక ఢిల్లీలో కూడా కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రభుత్వం రోజుకు 20 వేల కరోనా టెస్టులు చేస్తోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.  నగరంలో కరోనా పేషెంట్ల కోసం 13,500 హాస్పిటల్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.   జూన్ 8న అన్ లాక్-1 తర్వాత కరోనా కేసులు పెరుగుతాయని భావించామని... అయితే, ఊహించిన దానికంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.  

 

ఇక కరోనాని ఎదిరించడానికి  ఐదంచల వ్యూహంతో ముందుకెళ్తామని చెప్పారు. ఆసుపత్రి బెడ్స్ సంఖ్యను పెంచడం ఇందులో ప్రధానమైనదని కేజ్రీవాల్ చెప్పారు. కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను కోవిడ్ సెంటర్లుగా ప్రకటించడం వల్ల బెండ్ల సంఖ్యను మరో 3,500 పెంచామని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లోని 40 శాతం బెడ్లు కరోనా పేషెంట్లకు రిజర్వ్ అయి ఉన్నాయని చెప్పారు. అంతే కాదు ప్లాస్మా థెరపీని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. టెస్టింగ్, సర్వే, స్క్రీనింగ్ ను ముమ్మరం చేస్తామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: