టీడీపీ మత్తు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా బయటకు రాలేదు అని... వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. కాపులపై చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెట్టింది అని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత  కాపులకు అన్ని విధాలుగా న్యాయం చేసిందని ఆయన అన్నారు. కాపులపై కక్ష సాధింపుగా వ్యవహరించారు అని, గతంలో ఎంతో మంది కాపులను అక్రమంగా జైల్లో పెట్టారు అని అంబటి ఆరోపించారు. 

 

అప్పుడు ఎందుకు పవన్ ప్రశ్నించలేదు అని ఆయన మండిపడ్డారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఎప్పుడూ కష్టపడుతుందని అంబటి అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం ధర్మమా అని ఆయన నిలదీశారు. అర్హులు అయిన ప్రతీ ఒక్కరికి కాపు నేస్తం వర్తిస్తుంది అని అంబటి ఈ సందర్భంగా స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: