కడప జిల్లా జమ్మలమడుగు ముద్దనూరు మధ్యలో ఉన్న ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి.కడప జిల్లా జమ్మలమడుగు ముద్దనూరు రహదారి వద్ద ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతిచెందారు. ముద్దనూరు మండలం కొర్రపాడు గ్రామంలో ఇంటి నిర్మాణానికి సంబంధించి వస్తువుల కొనుగోలుకు జమ్మలమడుగు వచ్చారు.

 

 

 ట్రాక్టర్లు ఐరన్ రాడ్స్ వేసుకుని కూలీలతో సహా ముద్దనూరు మండలం కొర్రపాడు బయలుదేరారు. ముద్దనూరు ఘాట్ రోడ్డులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో పుల్లయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనలో గాయపడిన మరో నలుగురిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ముద్దనూరు పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: