అక్రమ మద్యం విషయంలో ఏపీ పోలీసులు ఎన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నా సరే అది మాత్రం ఆగడం లేదు. పోలీసుల కఠిన చర్యలను కూడా జనాలు పెద్దగా లెక్క చేయడం లేదు. తాజాగా మరోసారి భారీగా అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు కృష్ణా జిల్లా పోలీసులు. జిల్లాలోని మైలవరం మండలం పొందుగల పంగిడి చెరువు వద్ద భారీగా మద్యం బాటిళ్ళు స్వాధీనం చేసుకున్నారు. 

 

ఒక ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 729 మద్యం బాటిళ్లను తనిఖీల్లో గుర్తించి స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారు ఇద్దరూ ఇబ్రహీం పట్నం కొండపల్లికి చెందిన వారు అని పోలీసులు వెల్లడించారు. వారి ఆటో ని కూడా స్వాధీనం చేసుకుని ఇద్దరినీ రిమాండ్ కి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: