కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీపై బిజెపి నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇందిరా గాంధి అప్పుడు దేశాన్ని ఇబ్బందుల పాలు చేసారు అంటూ బిజెపి నేతలు ఒకరి తర్వాత ఒకరు విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛాగ్ కీలక వ్యాఖ్యలు చేసారు.  కాంగ్రెస్ విధించిన ఎమెర్జెన్సీ పై  దూరదర్శన్ ఆధ్వర్యంలో ‘వెబ్ సిరీస్’ తీయాలని ఆయన కోరారు. 

 

ఇలా చేయడం ద్వారా ప్రస్తుత తరానికి ఎమర్జెన్సీ రోజులు ఎంత ఘోరంగా ఉండేవే తెలిసినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయంపై తాను కేంద్ర ప్రసార మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కూడా త్వరలోనే కలుస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పటికి నాలుగు దశాబ్దాలు గడిచిందని చెప్పిన ఆయన... ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ చేసిన మితిమీరిన అకృత్యాల గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: