భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 360 డిగ్రీల పర్సనాలిటీ అని తెలంగాణా సిఎం కేసీఆర్ అన్నారు. దేశానికి పీవీ చాలా గొప్ప సందేశం ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు. పీవీ నరసింహారావు శత జయంతి వేడుకల సందర్భంగా పీవీ జ్ఞాన భూమిలో ఆయన మాట్లాడారు. ఈ రోజు మనసుకి చాలా సంతోషంగా ఉందన్నారు ఆయన. 

 

గురుకుల స్కూల్స్ ని పీవీనే ప్రారంభించారని ఆయన చెప్పుకొచ్చారు. పీవీ వ్యక్తిత్వాన్ని వర్ణించడానికి మాటలు చాలవని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.  ఆసియా దేశాలు అన్నీ కూడా భారత్ వైపు చూసే విధంగా పీవీ చేసారని ఆయన వివరించారు. అనేక రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి పీవీ అని ఆయన చెప్పుకొచ్చారు. పీవీ తెలంగాణా ఠీవి అని అన్నారు కీసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: