లడఖ్‌లో చైనా దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ... ప్రాణాలు కోల్పోయిన మన ధైర్య అమరవీరులకు భారత్ నమస్కరిస్తుందని అన్నారు. వారి శౌర్యం ఎప్పుడూ గుర్తుండిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు.

 

కొడుకులను కోల్పోయిన కుటుంబాలు, ఇప్పటికీ తమ ఇతర పిల్లలను రక్షణ దళాలకు పంపించాలని భావిస్తున్నాయని మోడీ అన్నారు. వారి ఆత్మ త్యాగం గౌరవనీయమైనదన్నారు మోడీ. బీహార్‌కు చెందిన అమరవీరుడు కుందన్ కుమార్ తండ్రి దేశాన్ని రక్షించడానికి తన మనవళ్లను కూడా సాయుధ దళాలకు పంపుతామని చెప్పారని వివరించారు. ప్రతి అమరవీరుడి కుటుంబం యొక్క ఆత్మ ఇది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ కుటుంబాల త్యాగాన్ని ఆరాధించడం విలువైనదన్నారు మోడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: