భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అరిపిస్తున్నారు. సోషల్ మీడియాలో పీవీ జ్ఞాపకాలను నేమరవేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా ఏపీ సిఎం వైఎస్ జగన్ కూడా ట్విట్టర్ వేదికగా  పీవీ గురించి స్మరించుకున్నారు. 

 

ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేసారు. తన జన్మదినం సందర్భంగా శ్రీ  పి.వి.నరసింహారావు గారిని జ్ఞాపకార్ధం చేసుకోవాలని సిఎం జగన్ అన్నారు. ఒక తెలివైన రాజకీయవేత్త & బహుభాషా పండితుడు అంటూ కొనియాడారు. రావు గారు దేశాన్ని ఆర్థిక సరళీకరణ వైపు నడిపించారన్నారు. దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి రాబోయే తరాల వారు గుర్తుంచుకుంటారని జగన్ తన ట్వీట్ లో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: