భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి నేపధ్యంలో సోషల్ మీడియా వేదికగా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన కృషి ని మరువలేము అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు. తెలంగాణా సిఎం కేసీఆర్, ఏపీ సిఎం వైఎస్ జగన్, రెండు రాష్ట్రాల విపక్ష నాయకులు ట్విట్టర్ వేదికగా పీవీని స్మరించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు. శ్రీ పి.వి.నరసింహారావు గారు భారతదేశ ముఖ చిత్రాన్ని తన సంస్కరణల ద్వారా శాశ్వతంగా మార్చారని పేర్కొన్నారు. సంస్కరణల్లో దూరదృష్టి చూపించారని ఆయనను దేశం ఎప్పుడు కూడా గుర్తిస్తుందని అన్నారు. తన జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందాం అని విజయసాయి పేర్కొన్నారు.
The legacy of Sri P.V.Narasimha Rao garu will forever be remembered as a visionary leader who ushered a new wave of reforms which changed the face of india Forever. Remebering PV garu on his birth centenary.
— Vijayasai reddy v (@VSReddy_MP) June 28, 2020