కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. ప్రశ్నిస్తానంటూ 2014లో జనసేన ఏర్పాటు చేసిన పవన్‌కల్యాణ్‌ గత ఐదేళ్లలో టీడీపీని ఏం ప్రశ్నించారని విమర్శలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వన్‌కల్యాణ్‌ డ్యాన్సులు, డైలాగ్‌లకు ఆకర్షితులై కాపు యువత సొంత డబ్బుతో కార్యక్రమాలు చేశారని... పవన్ గత ఐదేళ్లలో టీడీపీని ఒక్క విషయంలో కూడా విమర్శించలేదని అన్నారు. 
 
టీడీపీ పాలనలో కాపు కార్పొరేషన్ నుంచి 1600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అంత తక్కువ ఖర్చు చేయడంపై ఎందుకు ప్రశ్నించలేదో పవన్ చెప్పాలని అన్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని మేనిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు ఆ హామీని విస్మరించినా పవన్ ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని భుజాల మీద మోసే ప్రయత్నం చేశారు తప్ప అన్యాయం జరిగినా ప్రశ్నించే ప్రయత్నం చేయలేదని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: