టీడీపీ నేత వర్ల రామయ్య సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజధాని అంశాన్ని అణిచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. జేఏసీ చేస్తున్న ఉద్యమానికి టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిని తరలించే సామర్థ్యం జగన్ కు లేదని వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానిపై సీఎం జగన్ కక్షతో వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. 
 
జగన్ ప్రజాస్వామ్యహితంగా పరిపాలన చేయడం లేదని పేర్కొన్నారు. జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా కలిసి ఉద్యమం చేయడానికి టీడీపీ సిద్ధంగా ఉందని మరోమారు స్పష్టం చేశారు. హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు మొట్టికాయలు తిన్న జగన్ సర్కార్ కు రంగులు వేయడంపై ఇప్పటికి తలకెక్కిన మత్తు దిగిందని అన్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: