ప్రాణాలు ఎప్పుడు ఎలా పోతాయో ఎవరికీ తెలియదు. ఇప్పుడు దేశమంతా కరోనా తో అతలాకుతలం అవుతున్నారు. కేసులు.. మరణాల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు చెరువులో పడి మృతి చెందిన సంఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామాల్లో ఈ దారుణ ఘటన జరిగింది.
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు గ్రామంలోని ఎర్రచెరువులో ఈతకు వెళ్లారు. అనుకోకుండా ఆ చెరువు లోతులోకి వెళ్లారు. బాగా లోతుకు వెళ్లడంతోనే చెరువులో మునిగి చనిపోయారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను స్థానికుల సహాయంతో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.