మన్ కి బాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేసారు. స్వదేశీ (మేడ్ ఇన్ ఇండియా) ఉత్పత్తులను ప్రజలు కొనుగోలు చేయాలని ఆయన స్పష్టం చేసారు. ప్రజలు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి, స్థానిక వాణి వినిపించడం ద్వారా దేశ పటిష్టతలో కీలక భూమిక పోషించాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేసారు. 

 

స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి దేశ పటిష్టతకు తోడ్పడటం కూడా ఒక రకంగా దేశ సేవేనని ఆయన పేర్కొన్నారు. ఏ వృత్తిలో ఉన్న వారైనా దేశ సేవకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. రక్షణ, సాంకేతిక రంగాల్లో పురోగమించేందుకు భారతదేశం నిరంతర ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటుందని  ఆయన పేర్కొన్నారు. రక్షణ రంగంలో మన దేశం చాలా దేశాల కంటే ముందు ఉందని అన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: