లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత హైదరాబాద్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి అని సిఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లో మరో 15 రోజులు లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. చెన్నై లో కేసులు పెరుగుతున్నాయి అని అందుకే లాక్ డౌన్ విధించారు అని ఆయన పేర్కొన్నారు. 

 

మూడు నాలుగు రోజుల్లో కేబినేట్ సమావేశం నిర్వహించి అప్పుడు నిర్ణయం తీసుకుంటామని సిఎం అన్నారు. కేసులు భారీగా పెరుగుతున్నాయి కాబట్టి కేబినేట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని ఆయన వివరించారు. హైదరాబాద్ తో పాటుగా పలు జిల్లాల్లో కూడా లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని అనే వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: