హైదరాబాద్ తో పాటుగా మరికొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ విధించే అవకాశాలు కనపడుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపధ్యంలో సిఎం కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయన కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కీలక వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ లో లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కేసులు పెరుగుతున్నాయని అన్నారు. 

 

లాక్ డౌన్ ని హైదరాబాద్ లో మరో 15 రోజుల పాటు విధించే ఆలోచనలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ తో పాటుగా రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ జిల్లాల్లో, వరంగల్ జిల్లాలో లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని తెలుస్తుంది. కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకునే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. త్వరలోనే కేబినేట్ సమావేశం కూడా జరగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: