మహారాష్ట్ర పోలీసుల్లో భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి కేసుల సంఖ్యా పెరుగుతుంది గాని తగ్గడం లేదు. వందల మంది పోలీసులు కరోనా బారిన పడుతున్నారు. ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే కేసులు పెరుగుతున్నాయి. 

 

ఇక గత 48 గంటల్లో, 1 పోలీసు కరోనాతో మరణించగా... 150 మంది పోలీసులకు కరోనా సోకింది అని మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు. మహారాష్ట్ర పోలీసుల్లో మొత్తం కేసుల సంఖ్య... 4666 కు చేరుకుంది. ౫౭ మంది పోలీసులు కరోనా కారణంగా మరణించారు. రోజు రోజుకి పోలీసుల్లో కేసులు పెరుగుతున్న నేపధ్యంలో 45 ఏళ్ళు పై బడిన పోలీసులను విధులకు రావొద్దు అని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సూచించే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: