టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి వైద్యం చేసిన ఇద్దరు వైద్యులకు కరోనా ఉందని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. ఆయనకు వైద్యం చేసిన వైద్యుల రిపోర్ట్ లు బయట పెట్టాలి అని ఆయన డిమాండ్ చేసారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా తీవ్రంగా ఉందని అన్నారు. జీజీహెచ్‌లో ఓ వైపు కోవిడ్ కేసులు, మరోవైపు నాన్ కోవిడ్ చికిత్సలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

 

కోవిడ్ రోగులకు చికిత్స అందించిన వైద్యులే ఇతర రోగులకూ వైద్య సేవలు అందిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీని వల్ల ఇతర రోగులకూ కరోనా సోకే ప్రమాదం ఉందని  ఆయన ఆరోపించారు. ఓ తల్లీ కూతురుకు కూడా ఇదే విధంగా కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన చెప్పారు. అచ్చెన్నాయుడుకి ఇక్కడే ఉంచి చికిత్స చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: