ఎర్రగడ్డ ఆస్పత్రిలో జవహర్ నగర్ కి చెందిన వ్యక్తి కరోనా కారణంగా మరణించిన తీరుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చెస్ట్ ఆస్పత్రి సూపరిండెంట్ స్పందించారు. వైద్యుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపధ్యంలో సూపరింటెండెంట్ మహబూబ్‌ఖాన్ మాట్లాడుతూ... బాధిత వ్యక్తికి వెంటిలేటర్‌ను తాము తొలగించలేదని ఆయన పేర్కొన్నారు. 

 

చనిపోయిన వ్యక్తికి అప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు కరోనా ఉపిరితిత్తులపైనే ప్రభావం చూపేదని చెప్పారు. ఇప్పుడు గుండెపైనా ప్రభావం చూపుతోందని ఆయన వివరించారు. చనిపోయిన వ్యక్తి విషయంలోనూ అదే జరిగిందన్న ఆయన... 35 నుంచి 45 మధ్య వయసు వారికి కరోనా వల్ల గుండెపై ప్రభావం పడుతుందని ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: