ఒక పక్క భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం క్రమంగా పెరుగుతున్న తరుణంలో చైనా సర్కార్ ఏ మాత్రం కూడా వెనక్కు తగ్గడం లేదు. భారత జవాన్లను టార్గెట్ చేస్తూనే ఉంది. అక్కడ గస్తీ ని చైనా ఆర్మీ భారీగా పెంచింది అని నిఘా వర్గాలు ఈ సందర్భంగా గుర్తించాయి. అక్కడ ప్రతీ రోజు కూడా చైనా ఆర్మీ తన బలగాల్లో మార్పులు చేస్తుంది అని పేర్కొన్నాయి. 

 

అదే విధంగా చైనా ఆర్మీలో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందిన వారిని సరిహద్దుల్లో చైనా మొహరిస్తుంది అని నిఘా వర్గాలు ఈ సందర్భంగా గుర్తించాయి. ఇక భారత ప్రభుత్వం అప్రమత్తం గా లేకపోతే మాత్రం ఇబ్బందులు వస్తాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అక్కడ యుద్ద ట్యాంక్ లను కూడా చైనా భారీగా మొహరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: