హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ పరిధిలోనే 888 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య ఇప్పటి వరకు 13,436కు చేరుకుంది. ఈ రోజు కరోనా బారిన పడి ఆరుగురు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారికి బలైనా వారి సంఖ్య 243కు చేరుకుంది.  ఇప్పటి వరకు 4,928 మంది బాధితులు చికిత్స అనంతరం కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.  తెలంగాణలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఆందోళన చెందాల్సిందేమీ లేదని తెలిపారు.

 

లంగాణలో కరోనా మృతుల సగటు 1.52 శాతం మాత్రమేనని అన్నారు. తెలంగాణలో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో వేలాది బెడ్లు సిద్ధం చేశామని వెల్లడించారు. పరిస్థితి సీరియస్ గా ఉన్నవారికే ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు. వ్యాధి లక్షణాలు లేనివారికి ఇంట్లోనే చికిత్స జరుగుతుందని తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: