ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కాపు సామాజిక వర్గం పై జగన్మోహన్ రెడ్డి  కపట ప్రేమ చూపిస్తున్నార‌ని.. కాపులపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేద‌ని  జనసేన పార్టీ నేతలు పోతున మహేష్,అక్కల గాంధీ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసినట్లుగా కాపులకు కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాల‌ని డిమాండ్ చేశారు. జ‌గ‌న్ 2000 కోట్ల రూపాయలు కాపులకు కేటాయించి కేవలం 400 వందల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశార‌ని.. కాపులకు జరుగుతున్న అన్యాయంపై వైసీపీలో ఉన్న కాపు మంత్రులు,ఎమ్మెల్యేలు,స్పందించకుండా ఉంటే మీరు చరిత్ర హీనులు అవుతార‌ని ఫైర్ అయ్యారు.

 

ఇక కాపు అభివృద్ధి,సంక్షేమం పవన్ కళ్యాణ్ తోనే సాధ్య‌మ‌ని.. వైసీపీ కాపు  నేతలు ప్రశించాల్సింది పవన్ కళ్యాణ్ ని కాదు జగన్మోహన్ రెడ్డిని అని హిత‌వు ప‌లికారు. కాపులకు తప్పనిసరిగా 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందే అని ప‌ట్టుబ‌ట్టారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు జనసేన సిద్ధం అని వారు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: