బెంగళూరు నగరంలో మంగళవారం రాత్రి ఓ అమానుషమైన ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి తన కూతురుకు నిద్ర మాత్రలు ఇచ్చి అత్యాచారం చేసిన ఘటన దుమారం రేపుతోంది.


నగరంలోని హరలూర్ ప్రాంతంలో 19 ఏళ్ల యువతి తన తండ్రి(40) , సవతి తల్లి తో పాటు నివసిస్తుంది. రాత్రి సమయంలో దగ్గు, జలుబు తో బాధపడుతున్న కుమార్తెకు ట్రీట్మెంట్ మెడిసిన్ పేరుతో నిద్ర మాత్రలు ఇచ్చాడు. మరుసటి రోజు యువతి నిద్రలేచి చూసేసరికి తన తండ్రి పక్కన పడుకొని ఉండటం గమనించిన యువతి తనపై లైంగిక వేధింపు జరిగినట్లు గుర్తించింది. వెంటనే తండ్రి చేసిన ఘోరమైన చర్య గురించి ఆమె తన సవతి తల్లికి చెప్పింది, కాని పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలని అని అనుకోలేదు.

తనపై జరిగిన లైంగిక దాడికి కృంగిపోయి, నేరాన్ని విస్మరించాలని నిర్ణయించుకుంది. బాధిత యువతి మరుగుదొడ్డిని శుభ్రం చేయడానికి వాడే రసాయనాన్ని తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. టాయిలెట్ శుభ్రపరిచే రసాయనాన్ని సేవించిన తరువాత, యువతి స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన పై జరిగిన లైంగిక దాడి గురుంచి పోలీసులకు తెలియజేసింది.  ఆమె పోలీస్ స్టేషన్లో  కుప్ప కూలిపోవడంతో ఆమెను వెంటనే వైద్య సంరక్షణ కోసం సెయింట్ జాన్ ఆసుపత్రికి తరలించారు.


 ఆమె కోలుకునే వరకు పోలీసులు ఎదురు చూస్తున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికలో తెలిపింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమె తండ్రిని అరెస్టు చేశారు.  అతన్ని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు.  నేరంలో సవతి తల్లి పాత్రను కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి ఇలాంటి అమానుషమైన ఘటన కు పాల్పడటం అందరి మనసులను కలచివేస్తోంది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: