కడప జిల్లా పత్తూరు వద్ద కారు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కడప రిమ్స్​కు తరలించారు.కడప జిల్లా ఖాజీపేట మండలం పత్తూరు సమీపంలో కారు చోటు చేసుకుంది. కారు టైరు పగిలి డివైడర్​ను ఢీ కొట్టింది. 

 

 

ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. కడప నుంచి పోరుమామిళ్లకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన నలుగురిని 108లో కడప రిమ్స్‌కు తరలించారు. ఖాజీపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ నలుగురు రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.
కేవలం టైరు పగిలి ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపినట్లు, అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: