కరోనా దెబ్బకు ప్రజా ప్రతినిధులు సైతం బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఐదుగురు ఎమ్మెల్యేలు కరోనా భారీన పడ్డారు. ఈ క్రమంలోనే గ్రహణం పూజలో పాల్గొనేందుకు వెళ్లిన ఓ ఎమ్మెల్యేకు కరోనా వచ్చింది. హరియణాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ సుధా కోవిడ్ -19 బారినపడ్డారు. కురుక్షేత్ర జిల్లాలోని థానేసర్ ఎమ్మెల్యే సుభాష్ సుధా ఉన్నారు.
ఇటీవల నిర్వహించిన గ్రహణం పూజలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే వెళ్లారు. ఆ తర్వాత జ్వరం భారీన పడడంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా ఎమ్మెల్యేకు కరోనా ఉన్నట్టు నిర్దారణ అయ్యింది. ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది హాజరయ్యారు. ఎమ్మెల్యేకు కరోనా సోకడంతో ఆయన కుటుంబ సభ్యులను క్వారంటైన్కు తరలించారు. కాగా హరియణాలో మొత్తం 13,829 కరోనావైరస్ కేసులు నమోదుకాగా, 223 మంది మృతిచెందారు.