దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 19,459 మంది కరోనా భారీన పడ్డారు. తాజా కేసులతో కరోనా బాధితుల సంఖ్య 5,48,138కు చేరింది. ఈ కేసులలో 2,10,120 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో 3,21,723 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 
 
గడిచిన 24 గంటల్లో 380 మంది మృతి చెందగా మృతుల సంఖ్య 16,475కు చేరింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సైతం భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే తప్ప వైరస్ ను నియంత్రించడం సాధ్యం కాదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: